ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియాకు బిగ్ షాక్ తలిగింది. 122 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. గిల్ (31), కోహ్లీ (1) తక్కువ స్కోర్కే పెవిలియన్కు చేరారు. ఇక ఇన్నింగ్స్ మొదటి నుంచి దూకుడుగా ఆడిన రోహిత్ శర్మ (76) భారీ షాట్ ఆడే ప్రయత్నంలో స్టంపౌటయ్యాడు. ప్రస్తుతం క్రీజ్లో శ్రేయస్ (15*), అక్షర్ (0*) పరుగులతో ఉన్నారు.