MDK: శివంపేట మండలం సికింద్రాపూర్ గ్రామ శివారులోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద గుండంలో పడి బాలుడు మృతి చెందాడు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద వారం వారం జరిగే ఉత్సవాలకు హైదరాబాద్ బాలాజీనగర్కు చెందిన కరుణాకర్ (14) కుటుంబం విచ్చేసింది. ఈ క్రమంలో ఆలయం వద్ద గుండంలో స్నానం చేసేందుకు దిగిన కరుణాకర్ మునిగి మృతి చెందాడు.