కృష్ణా: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా మచిలీపట్నంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఎస్పీ వీ. వినాయుడు ప్రజల వద్ద నుంచి అర్జీలను సోమవారం స్వీకరించారు. గుడివాడ నుంచి వనజ అనే వివాహిత మహిళ, తనకు వివాహం జరిగి రెండు సంవత్సరాలు అవుతుందని ఇంతవరకు పిల్లలు లేరని కారణంతో భర్త, అత్తింటి వారు బెదిరింపులకు పాల్పడుతున్నారని తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది.