కృష్ణా: మచిలీపట్నం రూరల్ మండలం చిలకలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగ నోట్ల ఘటనలో నలుగురి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ అబ్దుల్ నబీ తెలిపారు. శుక్రవారం రాత్రి సీఐ మాట్లాడుతూ.. దొంగ నోట్ల చలామణికి సంబంధించి రూ. 6,500 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామన్నారు.