ATP: అనంతపురం రూరల్ మండలంలోని ఆలమూరు చెరువుకు హంద్రీ-నీవా నీరు చేరి మరువపారడంతో ఎమ్మెల్యే పరిటాల సునీత గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా చెరువులో గంగపూజ నిర్వహించి జలహారతి ఇచ్చి గంగమ్మతల్లికి సారె సమర్పించారు. వైసీపీ దుష్ప్రచారం తప్పని, ఇప్పుడు చెరువులన్నీ నీటితో నిండుతున్నాయని పేర్కొన్నారు.