NTR: ఇబ్రహీంపట్నం(M) కొటికలపూడిలో రైతులకు పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీ జరిగింది. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు ఈ కార్యక్రమంలో పాల్గొని పుస్తకాలు అందజేశారు. రీసర్వే పూర్తైన గ్రామాల్లో కొత్త పాస్పుస్తకాలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. గతంలో రైతులు అధికారులు చుట్టూ తిరిగేవారని, ఇప్పుడు అధికారులే రైతుల వద్దకు వెళ్లి పుస్తకాలు ఇస్తున్నారని చెప్పుకొచ్చారు.