GNTR: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ దిగుమతులపై 50 శాతం పన్నులు పెంచడంపై వామపక్ష నేతలు మండిపడ్డారు. శనివారం మంగళగిరిలోని అంబేద్కర్ సెంటర్ వద్ద వారు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. సీపీఐ నేతలు మాల్యాద్రి, తిరుపతయ్య మాట్లాడుతూ.. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆంధ్ర రాష్ట్రంలోని ఆక్వా రంగానికి దెబ్బ అని మండిపడ్డారు.