ATP: రాప్తాడు మండలంలోని బండమీదపల్లి గ్రామంలో రూ.25లక్షల NREGS నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మంగళవారం ప్రారంభించారు. అనంతరం గోకులం షెడ్లను కూడా ప్రారంభించి సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల, గ్రామ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.