VZM: బొబ్బిలిలో గల స్థానిక శ్రీ సాయి డిగ్రీ కలేజీలో ఈనెల 29న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంత్ కుమార్ తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, ఏదైనా పీజీలో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులుగా పేర్కొన్నారు. 18-35 ఏళ్లలోపు యువత ఉదయం 9గంటలకు కాలేజీకి చేరుకోవాలన్నారు. 18 కంపెనీలు ఈ మేళాకు హాజరవుతున్నాయన్నారు.