ప్రకాశ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈనెల 4వ తేదిన కనిగిరిలో ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నట్లు పామూరు మండలం అధ్యక్షులు రంగసాని హుస్సేన్ రెడ్డి తెలియజేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. మండలం నుండి వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.