VZM: ఎస్కోట మండలం తాటిపూడి గురుకుల బాలికల కళాశాలలో తాత్కాలికంగా గణితం బోధించుటకు మహిళ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శారదా బాయి మంగళవారం తెలిపారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో టీజీ ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 20లోగా తమ దరఖాస్తులను కళాశాలలో అందజేయాలని కోరారు.