GNTR: మంగళగిరి మండలం ఆత్మకూరు జగన్ కాలనీలో డ్రైనేజీ, కరెంటు, పిచ్చి మొక్కలతో సమస్యలు ఎదురవుతున్నట్లు మంత్రి నారా లోకేశ్కు స్థానిక ప్రజలు తెలిపారు. వెంటనే స్పందించిన లోకేశ్, ఎంటీఎంసీ కమిషనర్ అలీం బాషాకు ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం స్పెషల్ డ్రైవ్ ద్వారా సమస్యలను కమిషనర్ పరిష్కరించారు. దీంతో కాలనీవాసులు లోకేశ్కు కృతజ్ఞతలు తెలిపారు.