E.G: రాజమండ్రిలో వినాయక చవితి సందడి నెలకొంది. సోమవారం సాయంత్రం నుండి వివిధ పరిమాణాల్లో, వివిధ ఆకృతుల్లో తయారు చేసిన గణనాథుని ప్రతిమలను అమ్మకాలు ప్రారంభించారు. దీంతో రాజమండ్రి నగరంలోని మెయిన్ రోడ్, డీలక్స్ సెంటర్, దేవి చౌక్, కంబాల చెరువు ప్రాంతాల్లో కొనుగోలుదారులతో సందడి వాతావరణం నెలకొంది. రాజమండ్రి నగరం నుంచే కాకుండా జిల్లా వ్యాప్తంగా గణనాథులను కొనుగోలు చేస్తున్నారు.