GNTR: కేంద్ర సహాయమంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం శుక్రవారం ఏర్పాటు చేశారు. కలెక్టర్ నాగలక్ష్మీ అధ్యక్షతన శంకరన్ కాన్ఫరెన్స్ హాలులో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆయన బ్యాంకర్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు రుణాలు అందజేసి అందరూ స్వశక్తితో ఎదిగేలా బ్యాంకర్లు కృషి చేయాలని సూచించారు.