పల్నాడు: అమరావతి ధ్యాన బుద్ధ విగ్రహం వద్ద బుధవారం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకూ సామూహిక యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు వెల్లడించారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించి యోగా అవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామన్నారు.