SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీలోని 20వ వార్డ్లో పలు వీధుల్లో సోమవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తమ్మినేని రవి పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేశారు. మున్సిపాలిటీలో పింఛన్ల పంపిణీ ప్రక్రియ పారదర్శకంగా సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.