ATP: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఈ వారం జరిగిన పశువులు, జీవాల సంతల ద్వారా రూ. 3.39 లక్షలకు పైగా ఆదాయం వచ్చినట్లు ఏడీఎం రాఘవేంద్ర కుమార్ తెలిపారు. శనివారం జరిగిన గొర్రెలు, మేకలు, పొట్టేళ్ల సంత ద్వారా రూ. 1,93,400 మేర వసూలు కాగా.. ఆదివారం జరిగిన సంత నుంచి రూ.1,45,800 మేర వసూలైనట్లు తెలిపారు. ఈ నగదును సోమవారం బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు.