VSP: సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి వారికి స్వర్ణ పుష్పార్చన గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితులు 108 బంగారు పుష్పాలతో కన్నుల పండగల ఈ కార్యక్రమం నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజ స్వామిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. తరువాత ఆలయ కళ్యాణ మండపంలోని వేదికపై స్వామివారి స్వర్ణ పుష్పార్చన చేపట్టారు.