మన్యం: మక్కువ మండలంలోని నగుళ్ళ కొండ అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు ఆదివారం ఉదయం అటవీశాఖ అధికారులు తెలిపారు. గజరాజుల కదలికలను ట్రాకర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, సమీప గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పంట పొలాల వద్ద జాగ్రత్తలు పాటించాలని, ఏనుగులకు దగ్గరగా వెళ్లరాదని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు.