KDP: CMRF పేదలకు వరం లాంటిదని AP పంచాయతీ రాజ్ ఛాంబర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటసుబ్బయ్య అన్నారు. సిద్ధవటం మండలం ఆకురోపల్లె గ్రామానికి చెందిన గాలి సుబ్బయ్య అనారోగ్యంతో బాధపడుతూ.. చికిత్స కోసం CMRF కోసం దరఖాస్తు చేసుకున్నారు. కుప్పాల వెంకటసుబ్బయ్య చొరవ తీసుకొని రూ.1,49,193 CMRF మంజూరు చేయించారు. CMRF చెక్కును మంగళవారం లబ్ధిదారుడికి అందించారు.