ప్రకాశ: కనిగిరి మున్సిపల్ కార్యాలయం శిథిలావస్థకు చేరింది. ఈ భవనం స్లాబు సిమెంటు పెచ్చులు ఊడి ఇనుప చువ్వలు బయటపడ్డాయి. దీంతో ఈ భవనంలో విధుల నిర్వహణ ప్రమాదకరంగా మారింది. రెవెన్యూ శాఖలో విధులు నిర్వహించే సిబ్బంది బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొని ఉంది.