ATP: యాడికి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ప్రజావేదిక వద్దకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యతపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జలవనరుల శాఖ, డీఆర్డీఏ, గనులు, వ్యవసాయ అనుబంధ శాఖలు ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొన్నారు.