NDL: నందికొట్కూరుకు చెందిన నలుగురు విద్యార్థులు ప్రతిభా పురస్కారాలకు ఎంపికయ్యారు. ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి ఈ పురస్కారం అందించనున్నారు. అఖిల్ 990 (ఎంపీసీ), పి. మేఘన 989 (ఎంపీసీ), పి. సుహానా బేగం 986 (బైపీసీ), ఎం. నవీన్ 980(ఎంపీసీ) మార్కులతో ప్రతిభ చూపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారిని అభినందించారు.