KRNL: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాన్ని అధికారి కామేశ్వర్ ప్రసాద్ ప్రారంభించారు. యోగా, వ్యాయామంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.