ప్రకాశం: త్రిపురాంతకంలోని ప్రముఖ పుణ్య క్షేత్రం బాల త్రిపుర సుందరి దేవి ఆలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి దంపతులకు ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా మంత్రికి ఈవో అనిల్ కుమార్ అర్చకులు ప్రసాద్ శర్మ ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి దంపతులు పూజలు చేశారు. అర్చకులు మంత్రికి అమ్మవారి ఆశీర్వచనాలు అందజేశారు.