W.G: రైతు భరోసా, ఉచిత పంటల భీమా, ధాన్యం కొనుగోలులో అక్రమాలు తదితర అంశాలపై వైసీపీ చేపట్టిన పోరుబాట కార్యక్రమంలో భాగంగా భీమవరం కలెక్టరేట్ ఎదుట శుక్రవారం చేపట్టనున్న ధర్నా కార్యక్రమానికి తణుకు నియోజవర్గం నుంచి వైసీపీ నేతలు, రైతులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ మేరకు వైసీపీ శ్రేణులు వాహనాల్లో తరలి వెళ్లారు.