KRNL: ఆదోని పట్టణ శివారులోని సిరుగుప్ప చెక్పోస్ట్ సమీపంలోని గోదాములో నిల్వ ఉంచిన 109 బస్తాల అక్రమ రేషన్ బియ్యాన్ని శనివారం రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటీ తహశీల్దార్ బాబు ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో ఈ బియ్యం సీజ్ చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బ్లాక్ మార్కెట్కు తరలించే ముఠాలపై అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు.