VSP: ఆనందపురం మండలం మిందివానిపాలెం హైవేలో బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గొర్రెల మందపైకి లారీ దూసుకెళ్లడంతో 25 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనతో గొర్రెల కాపరి ఆవేదన వ్యక్తం చేశాడు. పశుపోషకులు పెద్ద ఎత్తున నష్టపోయారని, ప్రభుత్వం నుంచి తక్షణమే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్ ఎస్సై పాపారావు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.