ప్రకాశం: బల్లికురవ మండలంలోని మైనర్ ఇరిగేషన్ చెరువు అయినటువంటి చెన్నుపల్లి, అంబటి పూడి గ్రామ చెరువులకు ఈనెల 21వ తేదీన రెండోసారి వేలం నిర్వహిస్తున్నట్లు మత్య్సశాఖ సహాయ పరిశీలకులు రవీంద్ర తెలిపారు. ఉదయం 10 గంటలకు చెన్నుపల్లి, మధ్యాహ్నం రెండు గంటలకు అంబడిపూడి చెరుకు సంబంధించి ఈ వేలం పాట జరుగుతుందన్నారు.