NDL: అటవీ సంపదను సంరక్షించుకుంటూ వన్యప్రాణులను కాపాడుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నంద్యాల కలెక్టర్ జి. రాజకుమారి అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. పచ్చర్ల ఎకో టూరిజమ్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాతో కలిసి జిల్లా అటవీ సంరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ, వన్యప్రాణుల సంరక్షణపై పోస్టర్లను ఆవిష్కరించారు.