W.G: మొగల్తూరు మండలం ముత్యాలపల్లి బండి ముత్యాలమ్మ జిల్లా పరిషత్ హైస్కూల్లో శనివారం స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణాన్ని కాపాడుతూ స్వచ్ఛమైన గాలి కోసం కృషిచేయాలని సర్పంచ్ అడాలసూరిబాబు,సెక్రెటరీ ఎం సత్యనారాయణ విద్యార్థులకు వివరించి, హైస్కూల్లో మొక్కలు నాటారు.హెచ్ఎం రామరాజు,సచివాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.