KKD: అన్నవరం సత్యదేవుడి వార్షిక ఉత్సవాలలో భాగంగా దివ్యకళ్యాణం ఇవాళ రాత్రి 9 గంటలకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారుని ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. సుమారు 40 అడుగుల వెడల్పుతో వివిధ పుష్పమాలికలు, విద్యుద్దీపాల ఆలంకరణలతో కళ్యాణ వేదికను శోభాయమానంగా తీర్చిదిద్దారు. సుమారు 25 వేల మంది భక్తులు విచ్చేస్తారని తెలిపారు.