GNTR: పొన్నూరు మండలం, చింతలపూడిలో జరిగిన చోరీ కేసులో నిందితుడు శుక్రవారం అరెస్టయ్యాడు. ఈనెల 24న చింతలపూడిలోని ఓ ఇంట్లో రూ.4 లక్షల విలువైన వెండి సామాన్లు చోరీకి గురయ్యాయని రూరల్ పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేసి, అతని వద్ద రూ. 2 లక్షల విలువైన వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు.