ATP: ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ శనివారం నార్పాల మండలం గూగూడులో పర్యటించారు. కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఆయన స్వామి తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం రూ.50 లక్షల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.