ATP: ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్ల పంపిణీకి అన్ని విధాల సన్నద్దం కావాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం అనంతపురం నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్ల పంపిణీకి సంబంధించిన నియోజకవర్గ అధికారులు, బ్యాంకు మోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు.