MBNR: పూరి జగన్నాథుడి ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఉండాలని మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ ఆకాంక్షించారు. శనివారం జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ వద్ద జగన్నాథ రథయాత్ర కార్యక్రమానికి ఎంపీ హాజరై ప్రత్యేక పూజలను నిర్వహించారు. జగన్నాథ రథయాత్ర కార్యక్రమంతో మహబూబ్ నగర్ పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొందన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.