NGKL: వంగూరు మండలం తిప్పారెడ్డిపల్లిలో శనివారం క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గ్రామంలోని ప్రభుత్వ వైకుంఠధామం ఎదుట రోడ్డుపై క్షుద్ర పూజలు చేశారు. నల్ల కవర్లో జిల్లేడు పూలుపెట్టి, కొబ్బరికాయలు కొట్టి, కుంకుమ, పసుపు రోడ్డుపై వెదజల్లారు. నిమ్మకాయలు కోసి రోడ్డుపైన పెట్టారు. చుట్టుపక్కల 6 గ్రామాల ప్రజలు ఈ రోడ్డు గుండా ప్రయాణం చేస్తారని పేర్కొన్నారు.