కృష్ణా: జులై 9న కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెను గుడ్లవల్లేరు మండలంలో జయప్రదం చేయాలని అంగన్వాడీ కార్యకర్తలు శనివారం పిలుపునిచ్చారు. అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం రూ.26,000గా నిర్ణయించి, వారిని ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించి, రిటైర్మెంట్ ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేశారు.