VKB: షెడ్యూల్డ్ కులాలు, గిరిజన అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ స్కీం కింద విద్యార్థుల ఎంపిక నిర్వహించినట్లు జిల్లా అదనపు కలెక్టర్ ఎం. సుధీర్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో 1, 3, 5, 8వ తరగతి విద్యార్థులను స్కీం కింద డ్రా పద్ధతిలో ఎంపిక చేసినట్లు చెప్పారు. ఎంపికైన విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.