ప్రకాశం: డ్రోన్ల ద్వారా శాంతి భద్రతల పటిష్టతతోపాటు నేరాల కట్టడి, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక నిఘా పెట్టడం సులువవుతుందని ఎస్పీ దామోదర్ చెప్పారు. తాళ్లూరు మండలం విఠలాపురం కాలనీకి చెందిన మారం అనంతరెడ్డి శనివారం ఒంగోలులోని పోలీస్ కార్యాలయంలో అత్యాధునిక సాంకేతికత కూడిన డ్రోన్ కెమెరాను జిల్లా ఎస్పీకి అందచేశారు.