SRPT: ప్రభుత్వం తీసుకున్న హైడ్రా నిర్ణయంతోనే రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా కుప్పకూలి కుదేలయిందని తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. శనివారం సూర్యాపేటలో మాట్లాడారు. ఎఫ్ టి ఎల్ పరిధిని 200 మీటర్లు కాకుండా కేవలం 30 మీటర్ల వరకే తగ్గించి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.