కోనసీమ: మండపేట పురపాలక సంఘం కౌన్సిల్ సాధారణ సమావేశం ఈ నెల 30 సోమవారం నిర్వహిస్తున్నట్లు మండపేట పురపాలక సంఘం చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సమావేశం హాల్లో అజెండాలోని 16 అంశాలను చర్చించి, ఆమోదిస్తారన్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు హాజరవుతారని పేర్కొన్నారు.