కోనసీమ: తమ హక్కుల సాధన కోసం ఇంజినీరింగ్ కార్మికుల చేస్తున్న సమ్మె శనివారం 36వ రోజుకు చేరింది. మండపేట పురపాలక సంఘం ఎదురుగా ఏర్పాటు చేసిన సమ్మె శిబిరంలో కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సుబ్బరాజు మాట్లాడుతూ.. 13 వేల రూపాయల జీతంతో కుటుంబ పోషణ చాలా కష్టంగా ఉందన్నారు. దయనీయ పరిస్థితులతో తమ కుటుంబాలను పోషిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.