SKLM: ఇటీవల జరిగిన ఇండియన్ ప్రీమియం లీగ్లో డిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన త్రిపురాణ విజయ్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అభినందించారు. శనివారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో విజయ్ కుటుంబ సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. క్రికెట్ మ్యాచుల్లో మరింతగా ప్రతిభకనబరచి అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు.