TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో దుష్ప్రచారంపై మాజీమంత్రి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ‘అబద్ధాలు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. కొంతమంది కావాలనే నీచంగా మాట్లాడుతున్నారు. మీరు చేస్తున్న వ్యక్తిత్వ హననం వల్ల మా కుటుంబసభ్యులపై చెడు ప్రభావం పడుతుంది. నాపై తప్పుడు ప్రచారం చేసే ప్రతిఒక్కరిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాను’ అని హెచ్చరించారు.