NRPT: రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని క్రీడలు, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శనివారం మక్తల్ పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన కంది విత్తనాలను రైతులకు అందజేశారు. రైతులకు అందించిన కంది విత్తనాలు అధిక డిగుబలను ఇస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.