SRD: పాఠశాలలో విద్యార్థుల క్రమశిక్షణ ఎంతో అవసరమని సిర్గాపూర్ మండల విద్యాధికారి నాగారం శ్రీనివాస్ అన్నారు. శనివారం మండలంలోని లక్ష్మణ్ నాయక్ తండా ప్రాథమిక పాఠశాలలను ఆయన ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ప్రార్థన సమయంలో విద్యార్థుల క్రమశిక్షణపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక హెచ్ఎం దత్తురాజ్తో సమావేశమై పాఠశాల సమస్యలపై చర్చించారు.