NLR: వెంకటాచలం మండలం కాకుటూరు వద్ద ఉన్న విక్రమ సింహపురి యూనివర్సిటీలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, సోమిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగాజాబ్ మేళా నిర్వహించారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. మేళాకు 1,403 మంది హాజరయ్యారు. మొదటి విడతలో 438 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. షార్ట్ లిస్టులో మరో 106 మంది ఎంపికైనట్లు సోమిరెడ్డి తెలిపారు.