ATP: రాయదుర్గంలో మహిళా స్వయం సహాయక సంఘాలతో ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. అసంఘటిత రంగ కార్మికుల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాలు అందేలా కృషి చేయాలని సూచించారు. ఈ-శ్రమ్ పోర్టల్లో కార్మికుల వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రమాద బీమా రూ.2 లక్షలు వర్తిస్తుందని చెప్పారు.