E.G: రాజానగరం మండలం శ్రీకృష్ణపట్నం గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సమక్షంలో ఆదివారం జనసేన పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి ఆధారంగా ఆహ్వానించారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి చేరినట్లు వెల్లడించారు.